జమ్ము: భారీ వర్షాల నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను మళ్లీ నిలిపివేశారు. వాతావరణం అనుకూలించకపోవడంతో భాగ్వతినగర్ బేస్ క్యాంప్ నుంచి వయా పెహల్గాం, బల్తాల్ దారుల గుండా వెళ్లే యాత్రికులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఉధంపూర్ వద్ద నిలిచిపోయిన 1,798 మంది యాత్రికులను పెహల్గాం వరకు వెళ్లడానికి అనుమతించామని చెప్పారు. పెహల్గాం, బల్తాల్లో హెలికాప్టర్ సేవలను కుదించినట్లు పేర్కొన్నారు.