చిత్తూరు: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం పూరేడువారిపల్లిలో 80 మంది అస్వస్థతకు గురయ్యారు. కలుషిత ఆహారం తిన్న 80 మంది వాంతులు చేసుకున్నారు. అస్వస్థతకు గురైన ఆధితులను ఆస్పత్రికి తరలించారు. పీలేరు ప్రభుత్వ ఆస్పత్రిలో 60 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. పూరేడువారిపల్లెలో వైద్య శిబిరంలో 20 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.