నాగర్కోయిల్: తమిళనాడులో తీవ్రవాదులు ఎక్కువ అవుతున్నారని కేంద్ర మంత్రి రాధాకృష్ణనన్ ఆరోపించారు. నాగర్కోయిల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీవ్రవాద కార్యకలాపాలకు తమిళనాడు అడ్డగా మారుతోందన్నారు. జల్లికట్లు కోసం జరిగిన నిరసన ప్రదర్శనల్లో ఇదే నిజమైందన్నారు. ఈ అంశం గురించి చాన్నాళ్లుగా మాట్లాడుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. కొండ ప్రాంతాల్లో నక్సల్స్ శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎందుకు రాష్ట్రం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. నక్సల్స్, మావోయిస్టులు, ముస్లీం తీవ్రవాదులు కొన్ని మీడియా సంస్థల్లోనూ చొరబడినట్లు ఆయన తెలిపారు. ఈ సమస్యను ఇప్పుడే పరిష్కరించకుంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.