న్యూఢిల్లి : ఆధునిక సాంకేతికత వల్ల వ్యాపారం చేసుకునే విధానాలు సులభతరమయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. రానున్న కాలంలో మరింత సులభతరవుతాయని ఆయన చెప్పారు. దేశ ఆర్థిక రంగంలో జిఎస్టి వల్ల అనేక సానుకూల మార్పులు సంభవించాయన్నారు. నేడిక్కడి అక్బర్ రోడ్లో వాణిజ్య భవన్కు మోడీ శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.