శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లో కొన్ని రోజులుగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని జమ్మూకశ్మీర్ పోలీసులు శ్రీనగర్, అనంత్నాగ్, పుల్వామా జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. నేడు దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు సహా ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఇటీవలే ప్రముఖ జర్నలిస్ట్ బుఖారీ హత్యకు నిరసనగా జాయింట్ రెసిస్టెంట్ లీడర్షిప్ (జేఆర్ఎల్) నేతృత్వంలో వేర్పాటువాదులు ఆందోళనకు పిలుపునిచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలు నిలిపేసినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.