ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ నేతృత్వంలోని ప్రభుత్వం రూపొందించే విధానాలు అమల్లోకి వచ్చే వరకు రివర్ రాఫ్టింగ్, పారా గ్లైడింగ్ వంటి ఇతర జల క్రీడలను హైకోర్టు నిషేధించింది. చట్టవిరుద్ధంగా జల క్రీడలను నిర్వహిస్తున్నారని, కాగా, జల క్రీడలను నియంత్రించడానికి ఎటువంటి చట్టాలేవనీ న్యాయస్థానం పేర్కొంది. దీనిపై పారదర్శక ముసాయిదా విధానాన్ని రూపొందించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జల క్రీడల నిర్వహణకు చట్టవ్యతిరేక లైసెన్సులను ప్రైవేట్ కంపెనీలకు మంజూరు చేయడంపై దాఖలైన పిటిషన్పై ఈ నెల 18న కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముసాయిదా విధానం ద్వారా ప్రభుత్వం జల క్రీడలను ధరలను తగ్గించి, క్రీడల నిర్వహణకు టెండర్లను ఆహ్వానించాలని తెలిపింది. అనధికారిక కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి తన బాధ్యతలను విస్మరించవచ్చు. కానీ రివర్ రాఫ్టింగ్ ప్రమాదకరమైన క్రీడ, నియంత్రించకపోతే పారాగ్లైడింగ్ కూడా అటువంటిదే. తెహ్రీ ఆనకట్ట వద్ద పెద్ద సరస్సులో జల క్రీలు ప్రాణాంతకం. వీటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని కోర్టు పేర్కొంది. నదీతీరంలోని కొన్ని చిత్రాలను పరిశీలించిన తర్వాత నదులను సంరక్షించేందుకు ఎటువంటి నిర్వహణ చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. ఇటువంటి కార్యకలాపాల వల్ల నది, పరిసర ప్రాంతాల పర్యావరణం, జీవావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొంది. పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతుందో, అదే సమయంలో నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాలను రూపొందించిన అనంతరం జల క్రీడలను ప్రారంభమవుతాయి.