న్యూఢిల్లి : సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్, ఫొటోలు మొదలైనవి పోస్టు చేయవద్దని బిజెపి కార్యకర్తలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా హెచ్చరించారు. సోషల్ మీడియా వారియర్స్ అనే అంశంపై బిజెపి కార్యకర్తలు, మద్దతుదారులతో అమిత్షా మాట్లాడుతూ గత నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేయాలన్నారు.