డెహ్రాడూన్ : ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈ సందర్భంగా ప్రధాని మోదీ .. డెహ్రాడూన్లో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయన అనేక ఆసనాలను వేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ యోగా డే సంబరాలు జరుగుతున్నాయి. పతంజలి మహర్షి అందించిన యోగాను ఇప్పుడు ప్రపంచ దేశాలు అనుసరిస్తున్నాయని మోదీ అన్నారు. ప్రతి ఏడాది విశ్వవ్యాప్తంగా జరుగుతున్న యోగా డేను గమనిస్తే ఇదే అర్థమవుతోందన్నారు. మంచి ఆరోగ్యం కోసం ప్రపంచదేశాలు యోగాను ఓ సామాజిక ఉద్యమంగా చేపట్టాయని మోదీ అన్నారు.