ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కడపలో దీక్ష చేస్తున్న వారు సీఎం చంద్రబాబు ఇంటి ముందుచేయాలి : జీవీఎల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 20, 2018, 07:31 PM

కడపలో దీక్ష చేస్తున్న వారు సీఎం చంద్రబాబు ఇంటి ముందు చేస్తే అన్ని విషయాలు తెలుస్తాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో 8 మైన్స్ ఉంటే అందులో 7 వర్కింగ్‌లో లేవని, ఒకటి మాత్రమే పని చేస్తుందన్నారు. సరైన సమాచారం, పరిజ్ఞానం లేకుండా దీక్షలు చేయడం సరికాదని, కడప జిల్లా పట్ల శ్రద్ధ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి, మెకాన్ సంస్థకు సమాచారం ఇవ్వాలన్నారు. అలా మీరు చేసినట్లైతే పని వేగంగా సాగే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వమైనా, సంస్థ అయినా సమాచారం లేకుండా కేంద్రప్రభుత్వం ద్వారా 3మిలియన్ టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ కలిగిన ప్లాంటును పెట్టాలంటే వేలకోట్లలో ఖర్చు ఉంటుందన్నారు. వేల కోట్లలో ఇన్వెస్ట్ మెంట్ చేయాలి అంటే దానికి సరైన సమాచారం లేకుండా స్టీల్ ప్లాంట్‌కి ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి వస్తుందిని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com