ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్కు కర్మాగారం సాధన కోసం సి.ఎం.రమేశ్‌ ఆమరణ దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 20, 2018, 12:31 PM

కడపలో ఉక్కు కర్మాగారం సాధన కోసం టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్‌ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. పోట్లదుర్తి నుంచి ర్యాలీగా కడపకు చేరుకున్న సి.ఎం.రమేశ్‌ జడ్పీ కార్యాలయ ఆవరణలో ఆమరణ నిరాహారదీక్షకు కూర్చున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం సి.ఎం.రమేశ్‌ ఆమరణ దీక్షను ప్రారంభించారు. సి.ఎం.రమేశ్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి కూడా దీక్ష నిర్వహిస్తున్నారు. దీక్షా శిబిరంలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, నక్కా ఆనందబాబు, శిద్ధా రాఘవరావులతో పాటు టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com