కడపలో ఉక్కు కర్మాగారం సాధన కోసం టీడీపీ ఎంపీ సి.ఎం.రమేశ్ మరికాసేపట్లో ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. సి.ఎం.రమేశ్ పోట్లదుర్తి నుంచి కడపకు ర్యాలీగా బయలుదేరారు. కడప చేరుకున్నాక సి.ఎం.రమేశ్ జడ్పీ కార్యాలయ ఆవరణలో ఆమరణ దీక్షకు కూర్చోనున్నారు. అంతకు ముందు సి.ఎం.రమేశ్ గాంధీ, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలు వేయనున్నారు. సి.ఎం.రమేశ్తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నారు.