న్యూఢిల్లి : మొబైల్ ఫోన్ దిగ్గజాలు వొడాఫోన్, ఐడియా కంపెనీల విలీనంపై నేడు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డిఒటి) అధికారికంగా ఆమోదం తెలుపనున్నది. ఈ రెండు సంస్థలు ఇకపై వొడాఫోన్ ఐడియా లిమిటెడ్గా ఒక గొడుగు కింద పని చేస్తాయి. వొడాఫోన్ – ఐడియా విలీనంపై డిఒటి నేడు అధికారికంగా ఆమోదం తెలుపనున్నదని, ఈ మేరకు వారికి ఒక సర్టిఫికెట్ను అందజేయనున్నదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ రెండు సంస్థలు విలీనమైతే దేశంలో 35 శాతం మార్కెట్ షేర్తో అతి పెద్ద సంస్థగా అవతరిస్తుంది.