అమరావతి : రంజాన్ సందర్భంగా 12 లక్షలమంది ముస్లింలకు తోఫా ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రంజాన్ సందర్భంగా ముస్లింలకు ఉర్దూలో శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఉర్దూను రెండవ భాషగా చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అల్లాను కోరుకున్నానని ఆయన చెప్పారు. ముస్లిం విద్యార్థుల కోసం త్వరలో 25 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ముస్లింల కోసం ఏ ప్రభుత్వమూ అమలు చేయని పథకాలను తాము అమలు చేస్తున్నామని ఆయన అన్నారు. హజ్హౌస్ను టిడిపి ప్రభుత్వమే నిర్మించిందని ఆయన అన్నారు. మైనారిటీ యువతుల కోసం దుల్హన్ పథకం ప్రారంభించామన్నారు. త్రిపుల్ తలాఖ్ బిల్లుపై టిడిపి అభ్యంతరం చెప్పడం వల్లే అది జెపిసికి వెళ్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. త్రిపుల్ తలాఖ్కు మొదటగా అభ్యంతరం చెప్పింది తామేనని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఆ చట్టం రాకుండా చూస్తామని, చట్టం ద్వారా ముస్లింలను విచారించే అంశాలపై అభ్యంతరాలున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంలో ముస్లింల తరఫున తాము పోరాడుతామని చంద్రబాబు చెప్పారు