జమ్మూకశ్మీర్ : పుల్వామా జిల్లా ఔరంగజేబులో ఓ ఆర్మీ జవాన్ను ఉగ్రవాదులు అపహరించారు. అపహరణకు గురైన జవాన్ స్వస్థలం పూంచ్గా గుర్తించారు పోలీసులు. జవాన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బందిపొరా జిల్లా పనార్ అటవీ ప్రాంతంలో జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పుల్లో ఓ జవాను ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రతిఘటించిన భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చిన విషయం విదితమే.