ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూయించింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 09, 2018, 11:07 AM

నెలకొల్పి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. శుక్రవారం (జూన్ 8) ఐర్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 490 పరుగులు చేసింది. బ్యాట్స్ ఉమన్ల పరుగుల మోతతో డబ్లిన్‌లోని వైఎంసీఏ క్రికెట్ మైదానం హోరెత్తిపోయింది. మ్యాచ్ ఆసాంతం అద్భుతంగా రాణించిన న్యూజిలాండ్ కెప్టెన్ సుజీ బేట్స్ 94 బంతుల్లో 151 పరుగులు సాధించి సత్తా చాటింది. కెప్టెన్‌తో పాటు మూడో స్థానంలో దిగిన మాడీ గ్రీన్ కూడా సెంచరీతో కదంతొక్కడంతో రికార్డు స్థాయి స్కోరు నమోదైంది. 


క్రికెట్‌లో అత్యధిక పరుగుల రికార్డు ఇప్పటిదాకా న్యూజిలాండ్ మహిళా జట్టు పేరుతోనే నమోదై ఉంది. 1997 జనవరి 29న పాకిస్థాన్ జట్టుపై కివీస్ 455/5 పరుగులు సాధించింది. ఇక పురుషుల విషయానికొస్తే.. ఇంగ్లండ్ మెన్స్ క్రికెట్ టీమ్ పాకిస్థాన్‌పై సాధించిన 444/3 పరుగులే వన్డేల్లో ఇప్పటివరకు అత్యధిక స్కోరు. 2016 ఆగస్టు 30న నాటింగ్‌హమ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ఈ ఘనత సాధించింది. తాజాగా న్యూజిలాండ్ మహిళల జట్టు తన ఇన్నింగ్స్‌ 48 ఓవర్లలోనే ఈ స్కోరును అధిగమించింది. 


టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్ జట్టు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. ఐర్లాండ్ బౌలర్లకు చుక్కలు చూయించింది. 151 పరుగులతో సత్తా చాటిన కెప్టెన్ సుజీకి మరో ఓపెనర్ జెస్ వాట్కిన్స్ నుంచి (62) మంచి సహకారం అందింది. సుజీ ఇన్నింగ్స్‌లో 24 ఫోర్టు, 2 సిక్సులు ఉండటం విశేషం. 59 బంతుల్లో 62 పరుగులు చేసిన వాట్కిన్స్ ఇన్నింగ్స్‌లో 10 బౌండరీలు ఉన్నాయి. 


మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన మాడీ గ్రీన్ బ్యాట్‌తో విశ్వరూపం చూపెట్టడంతో కివీస్ జట్టు భారీ స్కోరు సాధించింది. కేవలం 77 బంతులు ఆడిన మాడీ 15 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 121 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అమెలియా కెర్ కూడా బ్యాట్ ఝళిపించడంతో న్యూజిలాండ్ జట్టు వన్డేల్లోనే అత్యధిక స్కోరు సాధించింది. కేవలం 45 బంతులు ఆడిన కెర్ 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసింది.కివీస్ బ్యాట్స్‌వుమన్ల ధాటికి 48 ఓవర్‌లోనే పురుషుల పేరుతో ఉన్న అత్యధిక పరుగుల (444) రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. చివరి రెండు ఓవర్లలో విరుచుకుపడి ఆడిన కివీస్ బ్యాట్స్‌వుమన్లు 45 పరుగులను రాబట్టడంతో రికార్డు స్థాయి స్కోరు నమోదైంది. క్రికెట్ ప్రపంచాన్నే నివ్వెరపరిచేలా అత్యధిక స్కోరు నమోదు చేసిన కివీస్ జట్టుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com