ప్రకృతి సేద్యంలో పండిన పంటలతో ఆయుష్షు పెరుగుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరులో ఏఎన్యూ దగ్గర జరుగుతున్న పెట్టుబడి రహిత-ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర స్థాయి సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ ప్రపంచానికి ఆదర్శమవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఐటీ ప్రొఫెషనల్స్ కూడా ఉద్యోగాలు వదిలి ప్రకృతి సేద్యం చేస్తున్నారని పేర్కొన్నారు.