టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఫోన్ చేసి పరామర్శించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో దాడి జరిగిన తీరును లోకేష్కు గోరంట్ల వివరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేక రాక్షస రాజ్యంలో ఉన్నామా? అనే అనుమానం వస్తోందన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే జీవో 1 రద్దు చేయాలని డిమాండ్ చేయడం కూడా జగన్ పాలనలో నేరమేనా? అని ప్రశ్నించారు. ఉన్నత విలువలతో సుధీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న గోరంట్లపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. సోమవారం అసెంబ్లీ లో జరిగిన ఘటనను ప్రజాస్వామ్యవాదులు అందరూ తీవ్రంగా ఖండించాలని పిలుపిచ్చారు. బుచ్చయ్య చౌదరిపై దాడి దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే బ్లాక్డే గా లోకేష్ అభివర్ణించారు.