అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జూన్ 2నుంచి 7వ తేదీ వరకూ నవ నిర్మాణ దీక్షలు జరుగనున్నాయి. జూన్ 2న విజయవాడలోని బెంజ్ సర్కిల్లో నవ నిర్మాణ దీక్ష జరుగుతుంది. తరువాత వరుసగా 3న కర్నూలు, 4న విజయనగరం, 5న తూర్పు గోదావరి ఏజెన్సీ ప్రాంతం, 6న కడప, 7న చిత్తూరులలో నవ నిర్మాణ దీక్షలు జరుగుతాయి. అనంతరం 8న నెల్లూరులో మహా సంకల్పం బహిరంగ సభ నిర్వహిస్తారు.