కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిపై బిజెపి తీవ్ర విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ ఎటిఎంకు కుమారస్వామి చీఫ్ మేనేజర్ (సిఎం) అని బిజెపి పేర్కొంది. తాను కాంగ్రెస్ పార్టీ దయాభిక్షతో ముఖ్యమంత్రినయ్యానని కనుక వారికే జవాబుదారీనని, ప్రజలు తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వనందును ప్రజలకు జవాబుదారీని కానని కుమారస్వామి ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీనిపై బిజెపి తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన ప్రకటన కంటే విషాదకరమైన అంశం మరొకటి ఉండదని బిజెపి అధికార ప్రతినిధి సంబిట్ పాత్రా అన్నారు.