విజయవాడలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. మహానాడులో సీఎం చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పార్టీ నేతలకు తినిపించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే బాలకృష్ణ, పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.