ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెరుగుతున్న పెట్రోలు ధరల భారాన్ని కేంద్రమే భరించాలి : యనమల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 25, 2018, 04:36 PM

న్యూఢిల్లి :  పెరుగుతున్న పెట్రోలు ధరల భారాన్ని కేంద్రమే భరించాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. అంతర్రాష్ట్ర మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికే రాష్ట్రంపై భారం పెరిగిందన్నారు. సమావేశంలో 6,7 చాప్టర్ల అధ్యయనం పూర్తయ్యిందన్నారు. పూంఛీ కమిషన్‌ చేసిన 302 ప్రతిపాదనలను పరిశీలించామన్నారు. రాష్ట్రాల ప్రయోజనాలకు అనుగుణంగా వాటిని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 15వ ఆర్థిక సంఘం వల్ల రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. 15వ ఆర్థిక సంఘంతో ముఖ్యంగా ఏపీకి బాగా నష్టం జరుగుతుందని సమావేశంలో ప్రస్తావించానన్నారు. ఈఅంశంపై కేంద్ర మంత్రులు చూస్తామని సమాధానం చెప్పారన్నారు. రాయల్టిdలు కూడా ఏపీకి వర్తించేలా చూడాలని కోరామన్నారు. మూడేళ్లకోసారి రాయల్టిdలు పెంచేందుకు స్టాండింగ్‌ కమిటీ ఒప్పుకుందన్నారు. అభివృద్ది, పర్యావరణం అంశాలను సంయుక్త జాబితాలో ఉంచాలని చెప్పామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com