బెంగళూరు : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముంగిట నకిలీ ఓటరు కార్డులు సంచలనం సృష్టించాయి, జనహళ్లిలోని ఓ అపార్ట్ మెంట్ లో ఎన్నికల సంఘం దాడులు చేసి 9వేలకు పైగా నకిలీ ఓటరు కార్డులను స్వాధీనం చేసుకుంది. నకిలీ ఓటరు కార్డుల వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ లు పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నాయి. నకిలీ ఓటరు కార్డుల విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాలని మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవెగౌడ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఇలా ఉండగా చిత్రదుర్గలో గాలి అనుచరుడు శ్రీరాములు బంధువుల నివాసాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.