ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆధార్ ఓటీపీతోనే ఇక నుంచి యూపీఐ రిజిస్ట్రేషన్

national |  Suryaa Desk  | Published : Tue, Feb 07, 2023, 12:33 AM

యూపీఐ సేవలు ఇక సామాన్యులకు సైతం అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ వాడాలంటే ఇకపై డెబిట్ కార్డ్ అవసరం లేదు. వాలిడ్ ఏటీఎం కార్డు లేకుండానే యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు. అందుకు ఒక్క ఆధార్ కార్డ్ అంటే చాలు. ఆధార్ ఓటీపీతోనే ఇక నుంచి యూపీఐ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. డెబిట్ కార్డు లేకుండానే ఆధార్ తో ఏ విధంగా యూపీఐ యాప్స్ రిజిస్ట్రేషన్ చేసుకుని వినియోగించుకోవచ్చనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.


వాలిడ్ ఏటీఎం కార్డ్ లేకపోవడంతో గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ యాప్స్ వాడలేకపోతున్నారా? అయితే మీకో శుభవార్త. ఏటీఎం కార్డ్ లేకుండానే యూపీఐ యాప్స్ వాడుకునేందుకు దేశంలోనే పెద్ద బ్యాంకుల్లో ఒకటైన ప్రభుత్వ రంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవకాశం కలిపిస్తోంది. అందుక ఆధార్ కార్డ్ ఉంటే చాలు. ఆధార్ ఆధారిత వన్-టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) అథెంటికేషన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గంతోల యూపీఐ యాక్టివేట్ చేసుకునేందుకు వాలిడి డెబిట్ కార్డు ద్వరా ఓటీపీ అథెంటికేషన్ తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయాన్ని తీసుకొచ్చింది పీఎన్‌బీ. ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


ఆధార్ ద్వారా యూపీఐ యాక్టివేట్ విధానంపై పంజాబ్ నేషనల్ బ్యాంక్ ట్వీట్ చేసింది.. ' ఇది మీకు తెలుసా? యూపీఐ రిజిస్ట్రేషన్ కోసం ఇకపై డెబిట్ కార్డ్ అవసరం లేదు. ఆధార్ కార్డుతోనే యూపీఐ సేవలను వినియోగించుకోండి. ఇది ఒక్క స్కాన్ దూరంలో. పూర్తి వివరాలు కోసం https://bit.ly/3V9NOw3 విజిట్ చేయండి.' అని పేర్కొంది పంజాబ్ నేషనల్ బ్యాంక్.


మరోవైపు.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం.. ' యూపీఐ సేవలను పొందడానికి ఆధార్ ఆధారిత ఓటీపీ ని తీసుకురావడం చాలా సులభమైన, మంచి అవకాశం. ఎవరికైతే డెబిట్ కార్డు లేని బ్యాంకు ఖాతాదారులు ఉంటారో వారు యూపీఐ సేవలు పొందేందుకు వీలు కలుగుతుంది. ఆధార్ ఓటీపీతో యూపీఐ పేమెంట్స్ సేవలను వారు సైతం అనుభూతి చెందవచ్చు. అయితే, ఆధార్ కార్డు వివరాలు తీసుకునేందుకు సదరు కస్టమర్ ఆమోదం ఉండాలి. ఆ తర్వాతే యూపీఐ పిన్ సెట్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలి ' అని పేర్కొంది ఎన్‌పీసీఐ.


ఆధార్‌తో యూపీఐ పిన్ ఎలా సెట్ చేసుకోవాలి?


యూపీఐ యాప్‌లోకి వెళ్లి సెట్ న్యూ యూపీఐ పిన్ ఆప్షన్ ఎంచుకోవాలి


ఆధార్ ఆధారిత వెరిఫికేషన్ ఎంచుకోవాలి


ఆ తర్వాత పాపప్ విండోలో ఆక్సెప్ట్ చేయాలి


తర్వాత ఆధార్ కార్డుపై ఉన్న చివరి 6 అంకెలను ఎంటర్ చేయాలి


రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి


మళ్లీ యాక్సెప్ట్ క్లిక్ చేయాలి


బ్యాంక్ ఆమోదం తెలిపిన తర్వాత కొత్త యూపీఐ పిన్ ఎంటర్ చేసి కన్ఫామ్ చేయాలి.


ఏటీఎం కార్డు లేని వారు యూపీఐ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆధార్ ఓటీపీ ద్వారా యూపీఐ పొందాలంటే ముందుగా వారి ఫోన్ నంబర్‌.. ఆధార్‌తో పాటు బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉండాలి. రెండింటికి ఒకటే మొబైల్ నంబర్ ఉందో లేదో కచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఒకటే ఉన్నప్పుడు మాత్రమే యూపీఐ యాక్టివేట్ చేసుకోవచ్చు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com