గుంటూరు జిల్లా దాచేపల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాచేపల్లిలో చిన్నారిపై వృద్ధుడి అత్యాచార ఘటనపై ప్రజా సంఘాలు భగ్గుమన్నాయి. నిందితుడు సుబ్బయ్యను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దాచేపల్లిలో స్థానికులు బంద్ పాటిస్తున్నారు. కాగా దాచేపల్లి ఘటనపై ఆగ్రహించిన ఆందోళనకారులు నిందితుడి ఇంటిని ధ్వంసం చేశారు. అత్యాచార ఘటన బయటపడడంతో నిందితుడు పరారీలో ఉన్నారు.