ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి మాటలను జనం నమ్మే పరిస్థితి లేదు: పేర్నినాని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 27, 2023, 11:48 PM

'ప్రజలు చంద్రబాబు, లోకేష్‌ మాటలను నమ్మే పరిస్థితిలో లేరని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని అన్నారు. పెన్షన్‌ తీసేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్‌ వల్ల చంద్రబాబు, లోకేష్‌ ఉద్యోగాలే పోయాయి. చంద్ర‌బాబుకు దమ్ముంటే జ‌గ‌న్‌పై ఒంటరిగా పోటీ చేయాలి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏం చేశారు. మీరు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా జగన్‌ను మిల్లీమీటరు కూడా కదపలేరు. కుప్పం సభలో నారా లోకేష్‌ భరితెగించి అబద్ధాలు మాట్లాడారు. ప్రజలు ఏమనుకుంటారో అన్న ధ్యాస లేకుండా.. మాట్లాడారు' అని పేర్ని నాని విమర్శలు గుప్పించారు.


పోలీస్‌ గన్‌మెన్ల భద్రతతో బతికే మీరు.. పోలీసుల గురించి ఇంత అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు.. పోలీసులను కించపరుస్తూ.. నిర్లజ్జగా మాట్లాడే వారిని ఏమనాలి? అని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఇటువంటి వారు ఆ పార్టీ అధ్యక్షులు అయితే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే.. మీ తొలు ఒలిచి.. పొలీసులకు 'షూ' తయారు చేయిస్తానని పేర్ని నాని ఘటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కుప్పం స్పీచ్‌పై పేర్ని నాని స్పందించారు.


'మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు. ప్రజలు ఏమనుకుంటారో? నాకు ఒక్కడికే కదా ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చిందన్న బెరుకు, భయం లేకుండా నారా లోకేష్‌ పబ్లిక్‌ మీటింగ్‌లో మాట్లాడారు. భయం లేదని పచ్చి అబద్ధాలు చెప్పారు. ఇసుక వేస్తే భూమి మీద పడే పరిస్థితి లేదట. అక్కడ కూర్చున్నవాళ్లు కుర్చీల్లో కూర్చున్నారు. ఒకసారి ఇసుక వేసి ఉంటే పరిస్థితి ఏంటో తెలిసేది' అని పేర్ని నాని సెటైర్లు వేశారు.


'మీ నాన్నగారి హాయంలో వేల కిలోమీటర్ల రోడ్లు వేస్తే.. ఇవాళ రోడ్ల వెంట తిరిగే గతి ఎందుకు పట్టింది? ప్రజలు ఎందుకు మిమ్మల్ని చెత్త చెత్తగా ఓడించారు? అంతా మాయాజాలం. ఇవాళ టీడీపీ ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉందంటే.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతారు.. చంద్రబాబు అధికారం లేకపోతే కార్యకర్తలకు సబ్బు రాస్తారు. దువ్వుతారు, నెత్తిమీద పెట్టుకుంటారు. అధికారం వస్తే అధికారులతో కలిసి వెళ్తారు. కార్యకర్తలను గాలికివదిలేస్తాడని అచ్చెన్నాయుడు మాట్లాడారు. లోకేష్‌ అలాంటి వ్యక్తి కాదు.. కార్యకర్తలకు మొత్తం దోచి పెడతారని మాట్లాడారు' అని నాని విమర్శలు చేశారు.


'మీ సంస్కారాన్ని, సాంప్రదాయాన్ని అద్దం పట్టే మంచి సైజ్‌ ఉన్న మనిషిని పార్టీ అధ్యక్షుడిగా నియమించుకున్నారు. అతని మాటలు కరెక్టా? లేకపోతే మా నాన్నే నాయకుడు అన్న లోకేష్‌ కరెక్టా? పోలీసులు లేనిదే బతకలేరు. ఏటేటా అమిత్‌ షా వద్దకు వెళ్లి, కోర్టులకు వెళ్లి గన్‌మెన్లను పెంచుకుంటారు. పోలీసులు కావాలంటారు. పోలీసు భద్రతను తగ్గించారని లబోదిబోమంటారు. మళ్లీ వారినే తిడతారు. ఇదెక్కడి పద్ధతి. ఎక్కువ తక్కువ మాట్లాడితే.. మీ తొలు ఒలిచి.. పొలీసులకు 'షూ' తయారు చేయిస్తా' అని పేర్ని నాని వార్నింగ్ ఇచ్చారు.


'లోకేష్‌ తొక్కుకుంటూ వెళ్తారట. ఏనుగులు ఏం చేస్తాయి.. దిశ చట్టం ఏమైంది అంటున్నారు. మీరు మోదీని అడగాల్సింది? మోదీ చెవిలో చెప్పాల్సింది. జగన్‌ పంపించిన దిశ చట్టం ఆమోదించి పంపించాలని మోదీకి చెప్పండి? 40ఏళ్ల వయసులోనే లోకేష్‌ భరితెగించి మాట్లాడుతున్నాడు. భూమ్‌ భూమ్, ప్రెసిడెంట్‌ మెడల్, ఆంధ్రగోల్డు బ్రాందీ అమ్ముతున్నారని లోకేష్‌ అంటున్నాడు. వీటి సృష్టికర్త మీ నాన్నారే అని తెలుసుకుంటే మంచిది. ఇంత నిర్లజ్జగా అసత్యాలు మాట్లాడటం దుర్మార్గం. జీవో1 ఎక్కడ మడత పెట్టి పెట్టుకుంటారో పెట్టుకోండి. స్టాన్‌ఫోర్డులో చదివాడట? ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం చేశారట. ఆయన చదువు, సంస్కారం ఏంటంటే..మీరు ఏం పీకావు అంటున్నారు' అని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com