ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ విచారణకు సంబంధించి డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) నిందితుల రూ.76.54 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో హైదరాబాద్లోని వట్టినాగులపల్లెలో అరుణ్ పిళ్లైకి చెందిన రూ.2.25 కోట్ల విలువైన ల్యాండ్ పార్శిల్, ఇండోస్పిరిట్ గ్రూప్కు చెందిన రూ.10.23 కోట్ల విలువైన 50 వాహనాలు, బ్యాంక్ బ్యాలెన్స్, రూ.14.39 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, ఆర్థిక సాధనాలను కూడా ఈడీ అటాచ్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పన మరియు అమలులో అవినీతి మరియు కుట్రల వల్ల ప్రభుత్వ ఖజానాకు కనీసం రూ. 2,873 కోట్ల నష్టం వాటిల్లిందని ఈడీ దర్యాప్తులో వెల్లడైంది.