అనంతపురం : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా నటుడు సాయికుమార్ రంగంలోనికి దిగుతున్నారు. బీజేపీ అభ్యర్థిగా నటుడు సాయికుమార్ చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి అసెంబ్లీ నియోజకవ్రగం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కొద్ది సందిగ్ధత అనంతరం బీజేపీ అధిష్టానం సాయికుమార్ కు బీఫారం ఇచ్చింది. దీంతో సాయికుమార్ ఈ రోజు తన నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ముందు అనంతపురం జిల్లా కదిరిలోని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ నుంచి కర్నాట్ లోని బాగేపల్లికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.