ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారికి విరాళంగా కల్యాణరథం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 24, 2018, 02:12 PM

తిరుమల: తిరుమల శ్రీవారికి ఈ ఉదయం కల్యాణరథం విరాళంగా అందింది. ఏపీలోని నెల్లూరుకు చెందిన హర్ష టయోట అధినేత శ్రీ హర్ష సుమారు రూ.60 లక్షలు విలువైన ఈ వాహనాన్ని టీటీడీకి అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట కల్యాణరథం బస్సుకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వాహనం తాళాలను టీటీడీ తిరుమల జెఈవో కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు దాత అందించారు. శ్రీనివాస కల్యాణాల నిర్వహణ కోసం ఈ కల్యాణరథాన్ని వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్‌పోర్టు జనరల్‌ మేనేజర్‌ శేషారెడ్డి, డీఐ భాస్కరనాయుడు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com