తిరుమల: తిరుమల శ్రీవారికి ఈ ఉదయం కల్యాణరథం విరాళంగా అందింది. ఏపీలోని నెల్లూరుకు చెందిన హర్ష టయోట అధినేత శ్రీ హర్ష సుమారు రూ.60 లక్షలు విలువైన ఈ వాహనాన్ని టీటీడీకి అందించారు. శ్రీవారి ఆలయం ఎదుట కల్యాణరథం బస్సుకు ప్రత్యేకపూజలు నిర్వహించారు. వాహనం తాళాలను టీటీడీ తిరుమల జెఈవో కె.ఎస్.శ్రీనివాసరాజుకు దాత అందించారు. శ్రీనివాస కల్యాణాల నిర్వహణ కోసం ఈ కల్యాణరథాన్ని వినియోగిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ట్రాన్స్పోర్టు జనరల్ మేనేజర్ శేషారెడ్డి, డీఐ భాస్కరనాయుడు తదితరులు పాల్గొన్నారు.