బెంగళూరు : కర్నాటక ఎన్నికల ప్రచారంలో విమర్శల పర్వం జోరెక్కింది. ఈ రోజు ఒక ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హిందువే కాదని విమర్శించారు. అమిత్ షా నేను హిందువును కానని చెప్పారు…కానీ నిజానికి ఆయనే హిందువు కాదు, ఆయన జైన మతస్తుడు అని సిద్దరామయ్య అన్నారు. షాకు హిందుత్వలో విశ్వాసం ఉండోచ్చు…కానీ ఆయన ప్రజల ముందుకు వచ్చి తాను జైన మతస్థుడిని కానని చెప్పాలని సవాల్ చేశారు.