కథువా నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న కారణంగా మంత్రి పదవిని కోల్పోయిన బీజేపీ నాయకుడు లాల్ సింగ్ కథువా బాధితురాలికి న్యాయం చేయాలన్న డిమాండ్ తో సాంబా సెక్టార్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. కథువా నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నందుకు రాష్ట్ర కేబినెట్ లో స్థానం కోల్పోయిన ఇద్దరు బీజేపీ మంత్రులలో లాల్ సింగ్ ఒకరు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు మంత్రిపదవికి రాజీనామా చేసిన లాల్ సింగ్ సాంబా లో భారీ ర్యాలీ నిర్వహించారు. కథువా బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆ ర్యాలీలో నినదించారు. కథువా బాధితురాలిని నిందితులు అపహరించి రోజుల తరబడి అత్యాచారం చేశారనీ, అయినా రాష్ట్ర పోలీసులు కనుగొనలేకపోయారని విమర్శించారు. హోంమంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.