ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కథువా బాధితురాలికి న్యాయం జరగాలంటూ లాల్ సింగ్ ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 17, 2018, 12:28 PM

కథువా నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్న కారణంగా మంత్రి పదవిని కోల్పోయిన బీజేపీ నాయకుడు లాల్ సింగ్ కథువా బాధితురాలికి న్యాయం చేయాలన్న డిమాండ్ తో సాంబా సెక్టార్ లో భారీ ర్యాలీ నిర్వహించారు. కథువా నిందితులకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పాల్గొన్నందుకు రాష్ట్ర కేబినెట్ లో స్థానం కోల్పోయిన ఇద్దరు బీజేపీ మంత్రులలో లాల్ సింగ్ ఒకరు. పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు మంత్రిపదవికి రాజీనామా చేసిన లాల్ సింగ్ సాంబా లో భారీ ర్యాలీ నిర్వహించారు. కథువా బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఆ ర్యాలీలో నినదించారు. కథువా బాధితురాలిని నిందితులు అపహరించి రోజుల తరబడి అత్యాచారం చేశారనీ, అయినా రాష్ట్ర పోలీసులు కనుగొనలేకపోయారని విమర్శించారు. హోంమంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తి ఈ సంఘటనకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com