లక్నో : ఉత్తరప్రదేశ్లోని ఎత్వాలో దారుణం జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శవమై కనిపించారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన ఆ ఇద్దరు.. రాత్రి అయినా కూడా ఇంటికి తిరిగి రాలేదు. రాత్రంతా ఆ ఇద్దరి కోసం వెతికారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. గ్రామానికి సమీపంలోని ఓ ఫామ్ హౌస్ వద్ద ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలిలో బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.