ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరప్రదేశ్‌లోని ఎత్వాలో దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 17, 2018, 12:09 PM

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఎత్వాలో దారుణం జరిగింది. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శవమై కనిపించారు. నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకెళ్లిన ఆ ఇద్దరు.. రాత్రి అయినా కూడా ఇంటికి తిరిగి రాలేదు. రాత్రంతా ఆ ఇద్దరి కోసం వెతికారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. గ్రామానికి సమీపంలోని ఓ ఫామ్ హౌస్ వద్ద ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలిలో బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com