న్యూఢిల్లి : రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగడంతో సభను వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఎపికి చెందిన ఎంపిలు నినాదాలు చేస్తున్నారు. వివిధ అంశాలపై ప్రతిపక్ష సభ్యులందరూ వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలు అడ్డుకున్నారు.