అమరావతి: పెద్ద సంఖ్యలో పల్లె వెలుగు బస్సులు కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థపై అసెంబ్లిలో జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించామన్నారు. గుంటూరు నుంచి సచివాలయానికి బస్సులు పెంచుతామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.