తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులు 29 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటల సమయం పట్టవచ్చు. ప్రత్యేక దర్శనం వారికి 2 గంటల సమయం పడుతుంది. శ్రీవారి నడక మార్గమున అర్థరాత్రి 12:00 గంటల నుండి అలిపిరి 14, శ్రీవారి మెట్టు 6 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీచేయబడును, మొత్తం 20 వేల టోకెన్లు పూర్తయిన తరువాత వచ్చే భక్తులు సర్వదర్శనం భక్తులతో కలిసి శ్రీవారిని దర్శించుకోవాలి. కాలినడకన తిరుమల చేరుకున్న భక్తులను ఉ: 08 గంటల తరువాత దర్శనానికి అనుమతిస్తారు. నిన్న 81,665 మంది భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కలిగింది. నిన్న స్వామివారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ.2.55 కోట్లు. నిన్న 37,751 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.