అమరావతి: పెన్నా బ్యారేజీ పనులు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు, ఈ రోజు ఉదయం పెన్నా బ్యారేజీ పనులను మంత్రి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. కాంక్రీట్ పనులు, గేట్లు బిగించే పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని...మరో రెండు నెలల్లో బ్యారేజీని అందుబాటులోకి తీసుకువస్తామని నారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ లాలూచీ రాజకీయాలు చేస్తోందని, బిజెపి-జగన్-పవన్ రాష్ట్రానికి సైంధవుల్లా మారారని విమర్శించారు.