కడప: ఒంటిమిట్టలోని కోదండరామస్వామి కళ్యాణ మహోత్సవం నేడు జరగనున్నది. ఈ మహోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. ఇప్పటికే ఆలయ సిబ్బంది ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు.