చెన్నై : కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని నమ్ముతున్నానని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి అన్నారు. బోర్డు ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన 6 వారాల గడువుకు ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు. సుప్రీం తీర్పు అమలుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నానని, తమిళనాడు రైతుల ప్రయోజనాల దృష్ట్యా బోర్డు ఏర్పాటు చేస్తుందని విశ్వసిస్తున్నానని ఆయన చెప్పారు.