ముంబయి: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడి నిశ్చితార్థం శనివారం గోవాలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రసెల్ మెహతా కూతురు శ్లోకా మెహతాను ముకేశ్ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ త్వరలో వివాహం చేసుకోనున్నాడు. ఈ ఏడాది ఆఖర్లో వీరిద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. రిలయన్స్ జియో కంపెనీ బోర్డులో ఆకాశ్ అంబానీ(25) డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రోజీ బ్లూ ఫౌండేషన్లో శ్లోకా మెహతా డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకొనే సమయంలోనే ఆకాశ్, శ్లోకా ఒకరినొకరు ఇష్టపడ్డారని, 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి కాగానే ఆకాశ్ లవ్ ప్రపోజల్ను శ్లోకా అంగీకరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
It's official now
Aakash Ambani engaged with Shloka#IPL2018 pic.twitter.com/oSoSS5fFiA
— stockguru07 (@stockguru07) March 24, 2018