ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భగత్‌సింగ్‌ స్ఫూర్తితో యువత హక్కుల కోసం పోరాటం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 24, 2018, 09:18 AM

 భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల స్ఫూర్తితో యువత హక్కుల కోసం పోరాటం చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. అన్యాయంపై ఎదురుతిరగడంలో వారిచ్చిన స్పూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమన్నారు. భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్ధంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. బానిస శృంఖలాల నుంచి భరతమాతను విడిపించేందుకు 1931 మార్చి 23న మాతృదేశం కోసం బలిదానాలు చేశారన్నారు. వారి ఆత్మార్పణలను తెలుగు రాష్ట్రాల యువత ప్రత్యేకంగా స్మరించుకోవడం గర్వకారణమన్నారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితులను తీసుకురావడంలో ప్రభుత్వాలు విఫమయ్యాయని, భగత్‌సింగ్‌,రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల స్ఫూర్తితో జనసేన హక్కుల కోసం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com