ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరం పూర్తి కాకుండా చూసేందుకు పెద్ద కుట్ర : చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 22, 2018, 12:33 PM

అమరావతి : పోలవరం పూర్తి కాకుండా చూసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతున్నారు. పోలవరంపై విపక్షాలు చేస్తున్నవన్నీ అవాస్తవాలని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు నేడు అడిగి తీసుకోలేదన్నారు. నిర్దిష్ట కాలవ్యవధిలో ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఏపీ ప్రభుత్వానికి పర్యవేక్షణ బాధ్యతలు ఇవ్వాలని నీతి అయోగ్ చెప్పడం వల్లనే కేంద్రం ఆ పని మనకు అప్పగించిందని చంద్రబాబు చెప్పారు. తానొక్కటే కోరుకుంటున్నానని, సకాలంలో పోలవరం పూర్తి కావాలన్నదే తన లక్ష్యమని 2019 నాటికి గ్రావిటీతో నీళ్లివ్వడమే తన లక్ష్యమని చంద్రబాబు అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com