న్యూఢిల్లీ : పాలకులు సున్నితత్వం కోల్పోయారని తెలుగుదేశం ఎంపి ఆవంతి శ్రీనివాస్ అన్నారు. లోక్ సభ వాయిదా అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా స్పీకర్ నాలుగు రోజులుగా సభ వాయిదా వేస్తున్నారని, బహుశా దేశ చరిత్రలోనే ఇలా జరగడం ప్రధమం అయ్యి ఉంటుందని ఆవంతి శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం తీరు దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా ఉందని విమర్శించారు. బిజెపి ప్రజాదరణ కోల్పోతున్నదని, రోజుకు లక్ష ఓట్లు కోల్పోతున్నదని అన్నారు. పాలకులు సున్నితత్వం కోల్పోయారని ఆయన అన్నారు. చర్చ చేపట్టే వరకూ అవిశ్వాస తీర్మాం నోటీసులు ఇస్తామని ఆయన చెప్పారు.