న్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ కు పట్టిన గతే మీకు పడుతుందని తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్ కేంద్రంలోని మోడీ సర్కార్ ను హెచ్చరించారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలన్నిటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.