కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తెలుగుదేశం ఎంపీలు నినాదాలు చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానంపై నోటీసులు అందినట్లు సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. వాటిపై చర్చకు అనుమతించాలంటే సభ ఆర్డర్ లో ఉండాలని సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. విరామం తరువాత లోక్ సభ ప్రారంభమైంది. వివిధ పక్షాల సభ్యులు నినాదాలు చేస్తూ పోడియంను చుట్టుముట్టారు. లోక్ సభ రేపటికి వాయిదా పడింది. సభ్యుల నినాదాల మధ్య స్పీకర్ మహాజన్ తెలుగుదేశం, వైకాపాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు అందినట్లు సుమిత్రామహాజన్ ప్రకటించారు. అయితే సభ్యులు నినాదాలు చేస్తండటంతో సభ ఆర్డర్ లో లేకుండా అవిశ్వాస తీర్మానాలపై చర్చను చేపట్టలేనని పదేపదే పేర్కొన్న స్పీకర్ సుమిత్రా మహాజన్ అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.