ఇండోర్ : ప్రధాని నరేంద్ర మోడీని అధికారంనుంచి దింపడానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కావాలని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ అన్నారు. జర్మనీ తదితర దేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెలికి తీయడంలో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు రెండూ విఫలమయ్యాయని ఆయన అన్నారు. ప్రజలను మోసగించడంలో రెండు పార్టీలు ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు.