న్యూఢిల్లీ : సభ సజావుగా సాగితేనే అవిశ్వాస తీర్మానాలపై చర్చకు అవకాశం ఉంటుందని లోక్ సభ స్పీకర్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. శుక్రవారం నాడు కూడా తెలుగుదేశం, వైకాపాలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినప్పటికీ…సభ ఆర్డర్ లో లేదంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ తీర్మానాలను చేపట్టని సంగతి తెలిసిందే. దీంతో రెండు పార్టీలూ మరోసారి అవిశ్వాసన తీర్మానం నోటీసులు ఇచ్చారు. అవి ఈ రోజు లోక్ సభ ముందుకు రానున్నాయి. అయితే ఈ రోజైనా అవి చర్చకు వస్తాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో స్పీకర్ కర్యాలయం సభ ఆర్డర్ లో ఉంటేనే తీర్మానాలపై చర్చకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశాయి.