కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సొంతంగా ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి వివిధ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, వామపక్షాలు, ఎంఐఎం, శివసేన, టీఆర్ఎస్లు టీడీపీకి తమ మద్దతు ప్రకటించాయి. అయితే ఇరవై నాలుగు గంటలకు కూడా గడవకుండానే అన్నాయడియంకె మాట మార్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాతో తమకేమీ సంబంధం లేదని, అవిశ్వాస తీర్మానానికి తాము మద్దతు ఇవ్వబోమని లోకసభలో అన్నాడియంకె పక్ష నేత పి. వేణుగోపాల్ ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. అన్నాడియంకెకు 37 మంది లోకసభ సభ్యులున్నారు.తమను వైసిపి నాయకులు సంప్రదించారని, అయితే తాము మద్దతు ఇవ్వబోమని చెప్పానని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కావేరీ