2023లో జరగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ముందు, రాష్ట్రంలోని మొత్తం 60 నియోజకవర్గాల్లో రేపటి నుంచి హర్ ఘర్ అభియాన్ను ప్రారంభించనున్నట్లు భారతీయ జనతా పార్టీ (బిజెపి) శనివారం ప్రకటించింది. నవంబర్ 27న ప్రారంభమయ్యే ఈ ప్రచారం డిసెంబర్ 3వ తేదీ వరకు కొనసాగుతుందని అని తెలిపారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని పునఃస్థాపిస్తామని బీజేపీ పేర్కొంది.