ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఇవాళ 109వ రోజు ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించనున్నారు. జగన్ తన 109వ రోజు పాదయాత్రను మరికాసేపట్లో చీరాల శివారు నుంచి ప్రారంభించనున్నారు. పాదయాత్ర కొత్తపేట, ఆంధ్రకేసరి జూనియర్ కాలేజ్, బాలాజీ థియేటర్, పేరాల, ఐటీసీ, ఆదినారాయణపురం మీదుగా ఈపూరుపాలెం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా ఈపూరుపాలెంలో జగన్ జనంతో మమేకం కానున్నారు. పాదయాత్రలో ఇప్పటి వరకు జగన్ 1,462 కిలోమీటర్లు నడిచారు.