లక్నో: ప్రముఖ బాలీవుడ్ నటి, సమాజ్వాదీ పార్టీ నేత జయాబచ్చన్ రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. యూపీ అసెంబ్లీ సెంట్రల్ హాల్లో రిటర్నింగ్ అధికారికి జయాబచ్చన్ తన నామినేషన్ పత్రాలు అందజేశారు. ఎస్పీ నేతలు డింపుల్ యాదవ్, రాజేంద్ర చౌదరి, కిరణ్మయి నందాతోపాటు సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ తదితరులు జయాబచ్చన్ వెంట ఉన్నారు. తనకు మరోసారి పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశమిచ్చినందుకు జయాబచ్చన్ ఎస్పీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్కు కతజ్ఞతలు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్ నుంచి 31రాజ్యసభ స్థానాలుండగా..వీటిలో ఖాళీ అవుతున్న 10 రాజ్యసభ స్థానాలకు మార్చి 23న ఎన్నికలు జరుగనున్నాయి.