అమరావతి : ఢిల్లీలో తాజా పరిణామాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పార్టీ ముఖ్యనేతలతో మరి కొద్ది సేపటిలో సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో ఆందోళనలు కొనసాగిస్తూనే…రాష్ట్రానికి కేంద్రం నుంచి రావలసిన నిధులను ఎలా రాబట్టుకోవాలనే దానిపై ఈ సమావేశంలో చంద్రబాబు చర్చిస్తారనిచెబుతున్నారు.